PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి

1 min read

-సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయిస్తా

-రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ముఖ్యమంత్రి జగనన్న మీకు మంచి చేసి ఉంటేనే మాకు ఓటు వేయండని రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గురువారం సిద్ధార్థ రెడ్డి,వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్,మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి,నందికొట్కూరు వైసిపి నాయకులు చంద్రమౌళి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా ఉప్పలదడియ, కలమందలపాడు,కడుమూరు 49బన్నూరు చౌటుకూరు దేవనూరు చింతలపల్లి కాజీపేట మిడుతూరు పైపాలెం నాగలూటి గ్రామాల్లో ఆయనకు నాయకులు మహిళలు ప్రజలు బ్రహ్మ రతం పట్టారు.ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో మీకు మంచి చేశాం కాబట్టే మీ ముందుకు ఓట్ల కోసం మళ్ళీ వచ్చామని అంతేకాకుండా జగనన్న ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందని ప్రతిపక్ష పార్టీ వాళ్లు లేనిపోనివి మాట్లాడుతున్నారని అంతే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ ప్రజల భూములను జగనన్న లాక్కుంటారంటూ ప్రజలను మభ్య పెట్టేందుకే వాళ్లు ఆ విధంగా మాట్లాడుతున్నారని అలాంటివారిని మీరు నమ్మవద్దని మండలానికి తాగునీరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తామన్నారు. పేదరికానికి ధనికులకు మధ్య జరిగే ఎన్నికలని స్వేచ్ఛగా స్వతంత్రంగా గౌరవంతో పాలించే వైయస్సార్ పార్టీ పాలన కావాలా లేక బానిసల పాలన కావాలా మీరే ఆలోచించుకోవాలన్నారు. డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో నాయకుడి దగ్గరికి వెళ్ళాక పోయినా సరే వారికి అర్హత ఉంటే చాలు ఆ డబ్బులు వారి అకౌంట్లో పడుతున్నాయని అన్నారు. నాకు మరియు ఎంపీ అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుకు రెండు కోట్ల వేసి  గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి, తువ్వా లోకేశ్వర్ రెడ్డి,చిన్న మల్లారెడ్డి,ఎస్ జగన్మోహన్ రెడ్డి, మోమిన్ మన్సూర్,వంగూరు జనార్దన్ రెడ్డి,గోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి,సాదిక్ మరియు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

About Author