PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ప్రజా సంక్షేమ పథకాలు అందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి

1 min read

– వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి

పల్లెవెలుగు  వెబ్  చెన్నూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు కుల, మత వర్గ బేధాలు లేకుండా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని, మళ్లీ మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన వారమవుతామని వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి , ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, శనివారం ఆయన చెన్నూరు లో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఇంటింటికి వెళ్లి ఆ ఇంటిలో ప్రభుత్వం ద్వారా ఏ ఏ సంక్షేమ పథకాలు వర్తించాయో, వాటి వల్ల ఆ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో వివరించి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఎమ్మెల్యే పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలకు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించారని ముఖ్యంగా ప్రతి పథకం మహిళా సంక్షేమానికే పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలందరూ వైయస్ఆర్ సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు, మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు, రాబోయేది మళ్లీ మన జగనన్న ప్రభుత్వమేనని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఆదరించాలని ఆయన ఈ సందర్భంగా ఓటర్లను కోరారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సొసైటీ అధ్యక్షులు అల్లి ఆవుల నవనీశ్వర్ రెడ్డి, శ్రీరామ్మూర్తి, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సీతారాం, రమేష్ రెడ్డి,అదేవిధంగా స్థానిక కే ఓ ఆర్ కాలనీలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డి( చిన్న బాబు) ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

సంక్షేమ పథకాలు, ఓటు, ఎంపీ,

About Author