PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలయోగి గురుకుల పాఠశాలకు 2 లక్షల రూ. వాటర్ ప్లాంట్ బహుకరణ

1 min read

ప్రారంభించిన బిజెపి నాయకులు,మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు

కృతజ్ఞతలు తెలియజేసిన ప్రిన్సిపాల్, విద్యార్థులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విద్యార్థి దశ నుంచే కష్టపడే చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, చదువు ఒకటే అన్ని సమస్యల కు పరిష్కారమని బిజెపి నాయకులు మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు అన్నారు. బాలయోగి గురుకుల పాఠశాలకు రెండు లక్షల రూపాయలు సొంత నిధులు సమకూర్చి వాటర్ ప్లాంట్ ను బహుకరించారు. విద్యార్థులు సమక్షంలో కావూరి సాంబశివరావు శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, బిజెపి నాయకులు కె కృష్ణ ప్రసాద్, జి శ్రీను, యు వెంకట్రావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి విద్యార్థులు పాల్గొన్నారు.

About Author