PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారం లో ఉన్న లేకున్నా జగన్నన్న వెంటే మా పయనం..  ఎస్ వి దంపతులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    ఈ రోజు మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని విజయవాడ లో ని స్వగృహం లో వైస్సార్సీపీ కర్నూల్ జిల్లా డిప్యూటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డిమరియు ఉమ్మడి కర్నూల్ జిల్లా మాజీ సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు ప్రజా క్షేత్రం లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేని ఆధిక్యం ఉందని ఊపిరి ఉన్నంత వరకు తమ రాజకీయ పయనం మీతో నే అని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూల్ నగరం వైస్సార్సీపీ పార్టీ బలోపేతం కావడం లో మీ కృషి అమోగం అని కొనియాడారు. జిల్లా రాజకీయ పరిస్థితి ల పై వారితో ముచ్చటించారు.

About Author