PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత దృక్పథంతో వరద బాధితులను ఆదుకుంటాం

1 min read

వై. నాగేశ్వరరావు యాదవ్

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: వరదరతో అతలా కుతులమై,  కనీస అవసరాలు లేక అల్లాడిపోతున్న విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయం అందించమని సీఎం చంద్రబాబు నాయుడు మరియు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి   పిలుపుమేరకు డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం టిడిపి నాయకులు వై ప్రభాకర్ రెడ్డి, టి శ్రీనివాసులు, జి. రామసుబ్బయ్య,, జి అంకిరెడ్డి, ఎన్. నాగేంద్ర, కాజా  ప్రిన్సిపాల్ మధు, సుదర్శన్, రాజశేఖర్ హనుమప్ప, దస్తగిరి, ఎస్ కే వలి, కడితం ప్రతాప్, కిట్టు  ఎంకే.కృష్ణయ్య,  కొంగనపల్లి ప్రతాప్, హర్ష,  పోద్దొడ్డి పుల్లారెడ్డి  మొదలైన వారు  రెండు లక్షల విలువ చేసే నిత్యవసర సరుకులు, వంట పాత్రలు, బట్టలు మరియు మందులు పంపిణీ చేయుటకు 500 మందితో 1000 కిట్లను తయారు చేయించడం జరుగుతుంది. డోన్ ఎమ్మెల్యే  కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 1000 కిట్ల లారీని జండా ఊపి ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *