PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

27 సంక్షేమ పథకాలను అట్టకెక్కించిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం  

1 min read

మాల సంఘాల జేఏసీ నేత ఎనుముల రాజకుమార్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  దళితుల ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి దళితులను ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎదగకుండా చేసారని, ఎస్సీ కార్పొరేషన్ నిధులను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదని మాల సంఘాల జేఏసీ నేత ఎనుముల రాజకుమార్ అన్నారు. నగరంలోని అంబెడ్కర్ భవన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో దళితుల సంక్షేమ పథకాలను అట్టెక్కించిన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ నిధి పేరుతో ఉన్న విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్య పేరు పెట్టడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. దళితులపై వైసిపి నాయకులు దాడులు చేస్తున్నా.. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో కర్నూల్ టౌన్ మరియు జిల్లాలో కానీ మాలలకు నామినేటెడ్ పోస్టుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా మాలలు గమనించి కూటమి అభ్యర్థి టీజీ భరత్ ను  లక్ష మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కర్నూల్ ను ఎంతో అభివృద్ధి చేసేందుకు టిజి భరత్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాలల కులవృత్తి అయినటువంటి ఎట్టిమాల బ్యాగరి స్మశాన కార్మికులకు పెన్షన్ ఇవ్వమని అడిగినప్పుడు సానుకూలంగా స్పందించిన నారా చంద్రబాబునాయుడుకి  ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దళిత నాయకులు ఈటె జమ్ముల్య, కుమ్మరి రత్న స్వామి, కందుకూరి విజయలక్ష్మి జగన్ తదితరులు పాల్గొన్నారు.

About Author