PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధితులకు న్యాయం చేస్తాం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షానికి భారీ చెట్టు కొట్టం పై పడడంతో కొట్టం పూర్తిగా దంసమైంది. ఆ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి  బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత ఈరన్న కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన సహాయాన్ని అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.   జాతీయ విపత్తు సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయానికి సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ, వీఆర్వోలు పాల్గొన్నారు.

About Author