PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడతాం

1 min read

మద్దతు తెలియజేసిన గుడ్ సమర్టన్ పాస్టర్స్ ఫెలోషిప్ సంఘo 

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మైనార్టీలు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్దె క్ష్యంగా జగనన్న ప్రభుత్వాo పనిచేస్తుందని ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పిలుపునిచ్చారు. మంగళవారం గుడ్ సమర్టన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో  క్యాంపు కార్యాలయంలో ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద ఎత్తున విచ్చేసిన పాస్టర్స్ అందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి తామంతా అండగా ఉంటామని తమ మద్దతు తెలియజేశారు. జగన్ ప్రభుత్వానికి అందరూ పని చేయాలని వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని మీ అందరూ మద్దతు కావాలని ఆళ్ల నాని కోరారు. కార్యక్రమంలో వ్యవస్థాపకులు కోలా కిరణ్, అధ్యక్షులు జె రాజ్ కుమార్, మరియు జోసఫ్ డానియల్ ,జి విక్టర్, ఎం ఆమోస్, హరిబాబు, డి యోహాను, పాల్, శ్యామ్ రాజు, సువర్ణ రాజు, కెఎల్ సుందర్రాజు, జె ఫెలోఇన్, బి రవి, తదితరులు కలిశారు. వీరితో డిప్యూటీ మేయర్ నూక పెయ్యి సుధీర్ బాబు, వైసిపి రాష్ట్ర సెక్రెటరీ పెరికె వరప్రసాదరావు పాల్గొన్నారు.

About Author