PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరుకు ఎత్తిపోతల పథకం తీసుకొస్తాం..

1 min read

గిత్త జయసూర్య,బైరెడ్డి శబరిలను గెలిపించండి..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దిగువపాడు హంద్రీనీవా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నుండి కలమందలపాడు చెరువుకు అక్కడి నుండి మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకం తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే భూమి పూజ చేస్తామని నంద్యాల టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి అన్నారు. మంగళవారం మిడుతూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 7 నుండి 12 గం.ల వరకు జరిగిన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు.ఈ ప్రచారంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉప్పలదడియ,కలమంద లపాడు,మాసపేట,49 బన్నూరు గ్రామాల్లో మాండ్ర శివానందరెడ్డి,,దేవనూరు,చింతలపల్లి,కాజీపేట గ్రామాల్లో శివానందరెడ్డితో పాటు నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య ప్రచారంలో పాల్గొన్నారు.వీరికి గ్రామాల్లో నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య,నంద్యాల టిడిపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరిలను మీ రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని శివానందరెడ్డి ప్రజలను కోరారు.ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య మాట్లాడుతూ నేను అల్లూరు గ్రామానికి చెందిన వాడను ఇక్కడి సమస్యలన్నీ నాకు తెలుసునని మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ముందు ఉంటానని అదేవిధంగా టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి, వంగాల శివరామిరెడ్డి, నందికొట్కూరు పట్టణ కౌన్సిలర్ జాకీర్ వివిధ గ్రామాల నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి,జయరామిరెడ్డి,సర్వోత్తమ్ రెడ్డి,నంద్యాల జిల్లా టిడిపి మైనారిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుల్తాన్,రమణారెడ్డి,సోఫీ సాహెబ్,మాజీ సర్పంచ్ లు నాగేంద్రుడు,చింతలపల్లి సర్పంచ్ రవణమ్మ,వెంకటేశ్వర రెడ్డి,శ్రీనివాసరెడ్డి నాయకులు నరసింహ గౌడ్,షహబాజ్,సుభాన్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author