PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేము పని చెయ్యం కొత్త అధికారితో పని చేయించుకోండి..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 42;

సేవలకు నిరాకరణ..రైతుల గోడు పట్టదా..

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ప్రభుత్వం మారడంతో గడివేముల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి వచ్చే అర్జీ దారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో భూ సమగ్ర రి సర్వే అనే కార్యక్రమంలో ఆన్లైన్ చేయడంలో లోపాలు తలెత్తడంతో కొంతమంది రైతుల సర్వే నంబర్లు కనపడక వన్ బి అడంగల్ ఆన్లైన్లో రాకపోవడంతో రైతులు తమ పొలాలకు వ్యవసాయ రుణం తీసుకోలేకపోతున్నట్టు మాన్యువల్ గానైనా తమకు పత్రాలు ఇస్తేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో. ఆన్లైన్లో కనపడకపోవడంతో మాన్యువల్ గా వీఆర్వో గుర్తించి ఎమ్మార్వో ద్వారా తమకు వన్ బి అడంగల్ ఇప్పించాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రెవెన్యూ శాఖ అధికారులు కనికరించడం లేదని. రైతులు వాపోతున్నారు మండల వ్యాప్తంగా రైతులకు ప్రధాన సమస్యగా మారిన ఈ సమస్యను మాత్రం తీర్చడానికి అధికారులు నిరాకరించడం కొత్త అధికారితో పని చేయించుకోవాలని తాము ఎన్నికల విధులకు మాత్రమే వచ్చామని చెప్పడం కొసమెరుపు.. అధికారులు మారినప్పుడల్లా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజల సమస్యలపై స్పందించాలని కోరుకుంటున్నారు .

About Author