PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనసేనలో కలుపు మొక్కలు..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

అధినేతను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసైనికుల ఫిర్యాదు..???

పల్లెవెలుగు న్యూస్ గడివేముల:  పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలకంగా పనిచేసిన జన సైనికుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన కలుపు మొక్కలను మర్యాద ఇస్తున్నారని సోమవారం నాడు జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గడివేముల మండల కేంద్రంలో ఉమ్మడి కర్నూల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు మరియు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీలో ముందు నుంచి ఉన్న జనసైనికులు తమ  అధినేతను కించపరిచిన వ్యక్తులు ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్నారని ఆరోపిస్తూ తమ అధినేత పవన్ కళ్యాణ్ అవమానించిన సదరు స్థానిక వ్యక్తి పై ఎస్సై నాగార్జున రెడ్డికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కార్యక్రమం ఉండడంతో తర్వాత మాట్లాడదామని ఎస్సై చెప్పడంతో వెను తిరిగిన జనసైనికులు తమ తమ నాయకుడిని అవమానించిన వారు మళ్లీ మా పార్టీలోనే వచ్చి సకల  మర్యాదలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తు పెటకోవాలని నాయకత్వాన్ని కోరారు.. ముఖ్యంగా హడావిడి చేసిన నాయకులు స్థానికంగా సంస్థగతంగా జనసేన ను బలోపేతం చేసే ఉద్దేశమే లేనట్టు కనపడిందని స్థానికులు మాట్లాడుకోవడం కోస మెరుపు.

About Author