PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమం అభివృద్ధే కూటమి  ప్రభుత్వ లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: సంక్షేమం అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టిడిపి నాయకులు మాధవరం రఘునాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బూదూరు, వి. తిమ్మాపురం, వగరూరు గ్రామాల్లో ప్రభుత్వం తలపెట్టిన పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిమ్మాపురం లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి, వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరి కి ఆయా గ్రామాల టిడిపి నాయకులు పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బూదూరు గ్రామంలో రెండు సిసి రోడ్లు, తిమ్మాపురం లో ఒక సిసి రోడ్డు, వగరూరు లో ఒక సిసి రోడ్డు కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తక్కువ రోజుల్లోనే ఎక్కువ మంది ప్రజల మెప్పు పొందిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందని తెలిపారు.  కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు నుంచి సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పీట వస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ప్రభుత్వం ఏర్పడిన తక్కువ రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, గోపాల్ రెడ్డి, ఎంపిడిఓ శోభారాణి, ఈఓఆర్డి ప్రభావతి, పంచాయతీ రాజ్ ఏఈ మల్లయ్య, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెంకట్రాముడు, ఎపిఓ తిమ్మారెడ్డి, బూదురు సర్పంచ్ నాగరాజు, మోసేస్, లక్ష్మి కాంత్, గొల్ల రాముడు, రామన్న, హనుమంతు, తిమ్మాపురం టిడిపి నాయకులు శివరాముడు, గోపాల్, వగరూరు టిడిపి నాయకులు పవన్ కుమార్, వీరారెడ్డి, లింగప్ప, గోపాల్, సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *