PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం యువకుడిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: బాపట్ల జిల్లాలోని ఈపురుపాలెం లో ముస్లిం యువకుడిపై చిన్న కారణం చేత హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని హొళగుంద ముస్లిం మైనారిటీ నాయకులు అబ్దుల్ సుభాన్, డియస్ భాషా, జాకీర్, అత్తాఉర్రహిమాన్, మోయిన్, కే.సుభాన్, అమాన్, ఇస్మాయిల్, రాంపురం బషీర్, జుమ్మా సలీం, శాలి మహబూబ్ బాషా, మాషా అల్లా వెల్ఫేర్ సొసైటీ మా భాష, ఉమార్, అబుబక్కర్, మహబూబ్ బాషా, తదితరులు కోరారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారుకు తన సైకిల్లో అడ్డంగా పెట్టి తీయలేదనే చిన్న కారణం చేత ఓ ముస్లిం మైనారిటీ యువకుడిని హత్య చేసిన సంఘటన బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో జరగటం చాలా బాధాకరమైన విషయమని, ముస్లిం యువకుడిని అకారణంగా హత్య చేసిన వారిని వెంటనే శిక్షించి వారి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ,రాష్ట్ర హోం శాఖ మంత్రి స్పందించి ఈ ఘటనపై దర్యాప్తు చేసి దుండగులకు కఠినంగా శిక్షించాలని ,అలాగే ముస్లిం చట్టాలకు భద్రతను కల్పించి హత్య కాబడిన యువకుడి కుటుంబానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

About Author