PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనవాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే

1 min read

శ్రీ దేవ వరప్రసాద్ , జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు

పల్లెవెలుగు వెబ్ అమరావతి:  జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలోని గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ , ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు హాజరై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు జనసేన కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారని చీటింగ్ కేసులు, భూ వివాదాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అపరిషృతంగా ఉన్న వారి సమస్యలను పరిష్కారం చూపాలని కోరుతూ అర్జీలు సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, పార్టీ నేతలు శ్రీ పి.బి.వి సుబ్బయ్య, శ్రీమతి రావి సౌజన్య, లీగల్ టీం సభ్యురాలు శ్రీమతి హనుమకొండ వాసవి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *