PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామచంద్రయ్య ను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం

1 min read

కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న సిపిఐ నాయకులు.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్యను గెలిపించాలని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య లు ఓటర్లను కోరారు. గురువారం మండలంలోని అటికెల గుండు, దేవనబండ, జూటూర్, అగ్రహారం, మండగిరి, హోసూర్ గ్రామాలలో ప్రజలను కలుసుకుని విస్తృత ప్రచారం నిర్వహించారు. కంకి కొడవలి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేయాలని బ్యాలెట్ నమూనా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడ్డ పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి గత పాలకులు ఏమాత్రం కృషి చేసింది లేదన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టే రైతు ఉద్యమ నాయకుడు రామచంద్రయ్యను గెలిపించినట్లయితే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుకు, కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ హస్తం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గిడ్డయ్య గౌడ్, జొహరాపురం నరసింహులు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

About Author