PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కెట్‌యార్డులో స‌మ‌స్యలు ప‌రిష్కరిస్తా.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

మార్కెట్‌యార్డులో ప్రచారం నిర్వహించిన‌ టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వ్యవ‌సాయ‌ మార్కెట్‌యార్డులో పేరుకుపోయిన స‌మ‌స్యల‌ను తాను గెలిచిన త‌ర్వాత ప‌రిష్కరిస్తాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని కొత్త బ‌స్టాండు స‌మీపంలో ఉన్న వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డులో టి.జి భ‌ర‌త్ ప్రచారం నిర్వహించారు. హోల్‌సేల్ రిటైల్ దుకాణాదారులు, కూర‌గాయల వ్యాపార‌స్తులు, మార్కెట్‌కు వ‌చ్చిన ప్రజ‌ల‌తో టి.జి భ‌ర‌త్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివ‌రించారు. ఎన్నిక‌ల్లో త‌ప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయాల‌ని ఆయ‌న ప్రజ‌ల‌ను కోరారు. క‌ర్నూలు ఎమ్మెల్యేగా త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌న్నారు. పార్టీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోతో పాటు క‌ర్నూలు కోసం తాను ప్రత్యేకంగా 6 గ్యారెంటీలు తీసుకొచ్చిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అనంత‌రం వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీలోని పార్కులో టి.జి భ‌ర‌త్ వాక‌ర్స్‌తో మాట్లాడారు. టీ కొట్టులో పెద్దలు, యువ‌కుల‌తో మాట్లాడి త‌న‌ను గెలిపిస్తే క‌ర్నూలును అభివృద్ధి చేస్తాన‌ని వివ‌రించారు. క‌ర్నూలుకు ప‌రిశ్రమ‌లు తీసుకొచ్చి యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన నేత‌లు పాల్గొన్నారు.

About Author