PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్యకర్తలకు అండగా ఉంటా

1 min read

మాజీ ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతానని, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవలసిన అవసరం లేదని కమలాపురం మాజీ శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, బుధవారం సాయంత్రం ఆయన మండలంలోని కొండపేట గ్రామంలో వైయస్సార్సీపి కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు, ఈ ఆత్మీయ సమావేశంలో ఆయన వైయస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను పేరుపేరునా పిలుస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని, అందరికీ అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా నిర్మోహమాటంగా తన వద్దకు వచ్చి చెప్పాలని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు, ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యులేనని ఏ సమస్య ఉన్న తనకు చెప్పాలని, అలా కాకుండా మీలో మీరే ఆ సమస్యను దాచుకుంటే తనకెలా తెలుస్తుందని, సమస్య తనకు తెలిసిన వెంటనే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపుతానని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కట్టుగా ఉండాలని అప్పుడే ఏ సమస్య అయినా సాధించుకునే మనోధైర్యం కలుగుతుందని ఆయన కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్కి వ్యక్తిగత దూషణలకు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు మంచి పద్ధతి కాదని ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చారో వాటన్నింటిని నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా తెలుగు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, అనంతరం కార్యకర్తలు, నాయకులు ఎం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి తమ సమస్యలను చెప్పుకోవడం జరిగింది, వారందరి సమస్యలను సావధానంగా విన్న రవీంద్రనాథ్ రెడ్డి ప్రతి ఒక్కరికి తానున్నాను అంటూ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలకరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైయస్సార్ సిపి మహిళా నాయకురాలు భాగ్యమ్మ, ఎంపీటీసీ దుంప నాగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About Author