PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేగా గెలిపించండి..అభివృద్ధి చేసి చూపిస్తా

1 min read

టీడీపీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం…ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య అన్నారు.నందికొట్కూరు నియోజకవర్గం నందికొట్కూరు పట్టణం 15వ వార్డులో బాబు సూపర్ సిక్స్  ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భాగంగానందికొట్కూరు పట్టణం 15వ వార్డు  ఇంచార్జ్ గోవర్ధనగిరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.శనివారం  కర్నూలు రోడ్డు లోని బైరెడ్డి నగర్ లో  నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి , టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య , పార్టీ పరిశీలకులు శ్రీకాంత్ రెడ్డి  నందికొట్కూరు పట్టణం 15వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు నాయుడు  ప్రకటించిన బాబు సూపర్ సిక్స్  పథకాలను వివరించారు.  మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు గిత్త జయసూర్య కు వేసి గెలిపించాల్సిందిగా కోరారు.టీడీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ముర్తుజావాలి, షకీల్ అహమ్మద్, జాకీర్ హుస్సేన్, జమీల్, చాంద్ బాషా, శ్రీకాంత్ గౌడ్, ఎల్లయ్య ఆచారి, సత్తార్, వహీద్, వడ్డే శ్రీను, వేణుగోపాల్, నిమ్మకాయల రాజు, కృష్ణారెడ్డి, రాజు, కుమార్, సురేష్, రవి, కళాకార్, నిమ్మకాయల మోహన్, పల్లె విజ్జి, అయ్యన్న, శేఖర్, మీనాక్షిదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author