PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

1 min read

జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ చేతుల మీదుగా

సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వర కు పార్టీ ఎన్నికల గుర్తు ఏఫారం, బీఫారం, అందజేత

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 2024 మే 13 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు కు పార్టీ ఎన్నికల గుర్తు కు సంబంధించి ఏ ఫారం బి ఫారం పత్రాలను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అందజేశారు.ఏ పారం బి ఫారం పత్రాలు అందించిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఎం యామిని జిల్లా నాయకులు కొండేటి బేబీ ఎం విజయ సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ కేంద్రంలో  బిజెపిని రాష్ట్రంలో బిజెపితో జతకట్టిన టిడిపి జనసేన ను రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా అప్పులు పాలు చేసిన వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని దేశంలో మరియు రాష్ట్రంలో ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ వామపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశ లౌకిక వ్యవస్థ కాపాడబడాలన్న మత సామరస్యాన్ని రక్షించు కోవాలన్న ప్రజాస్వామ్య విలువలను పెంపొందించుకోవా లన్న ఇండియా కూటమిని దేశంలోని రాష్ట్రంలోనూ గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.

About Author