PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామచంద్రయ్యను గెలిపించండి…

1 min read

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్యను గెలిపించుకుందామని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మండలంలోని పుచ్చకాయల మాడ, రామచంద్రాపురం, పెండ్లిమాన్ తాండా గుండు తండా ల లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని పత్తికొండ నియోజకవర్గాన్ని విస్మరించాయన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను చట్టసభలకు పంపిస్తే పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుకు, రాం పుల్లయ్య యాదవ్ హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ నాయకులు రవికుమార్, ఆనంద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ పాల్గొన్నారు.

About Author