PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరంతరం ప్రజల పక్షాన పోరాడే రామచంద్రయ్య ను గెలిపించండి

1 min read

ఉపాధి హామీ కూలీలను కలిసి ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నిరంతరం ప్రజల పక్షాన పోరాడే సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి.రామచంద్రయ్య ను గెలిపించాలని సిపిఐ మండల కార్యదర్శి  డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు పెద్ద ఈరన్న, సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు. గురువారం మండలంలోని పందికోన, దూదేకొండ గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం హోసూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించినట్లయితే నియోజకవర్గ అభివృద్ధితోపాటు, సాగు, తాగునీరు అందించి,ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుకు,  కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ హస్తం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పందికోన, కొత్తపల్లి, దూదేకొండ శాఖ కార్యదర్శులు జోహరాపురం కాశీ, గిడ్డయ్య గౌడ్, రాముడు, నాయకులు నరసింహులు,పెద్దయ్య, రవి,  వెంకటేశ్వర్లు, మస్తానయ్య, పులికొండ తదితరులు పాల్గొన్నారు.

About Author