PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యమ సారధి రామచంద్రయ్యను గెలిపించండి

1 min read

ఉపాధి హామీ కూలీలను కలిసి ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐ నాయకులు.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరుస్తున్న ఉద్యమ సారధి సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య ను గెలిపించాలని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఎం మండల కార్యదర్శి రంగారెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కృష్ణయ్య ఓటర్లను కోరారు. బుధవారం మండలంలోని జూటూరు గ్రామ పరిసర ప్రాంతాలలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే మండలంలోని పుచ్చకాయల మాడ గ్రామంలో, మరియు పట్టణంలోని కటిక వీధిలో ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే ఉద్యమ సారధి రామచంద్రయ్య ను గెలిపించి అసెంబ్లీకి పంపినట్లయితే పందికోన- కొత్తపల్లి రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలువ ను పొడిగించి, పంట పొలాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. రామచంద్రయ్య కంకి కొడవలి గుర్తుకు, కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ హస్తం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు దస్తగిరి, కొత్తపల్లి సిపిఐ శాఖ కార్యదర్శి గిడ్డయ్య గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, నాయకులు గుండు భాష, ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.

About Author