PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయోస్తు…

1 min read

జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో బరిలో దిగనున్న లోకేష్​ రెడ్డి

  • విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించిన త్రినాథ్ కిక్​ బాక్సింగ్​ అకాడమీ చైర్మన్​ డా.త్రినాథ్​

కర్నూలు, పల్లెవెలుగు:పశ్చిమ బెంగాల్​లోని సిలిగురిలో ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే కిక్​ బాక్సింగ్​ జాతీయ స్థాయి పోటీల్లో  ఆంధ్ర ప్రదేశ్​ నుంచి  కర్నూలుకు చెందిన లోకేష్​ రెడ్డి జూనియర్​ కేటగిరి విభాగంలో  బరిలో దిగనున్నారు. కర్నూలు నగరం డాక్టర్స్​ కాలనీలో ఉన్న  త్రినాథ్ కిక్ బాక్సింగ్​ అకాడమీలో శిక్షణ పొందిన లోకేష్​ రెడ్డి శనివారం కోచ్​ నరేంద్ర తో కలిసి  అకాడమీ చైర్మన్​, అమ్మ, ఆర్క్ హాస్పిటల్​ అధినేత డా. త్రినాథ్​ను కలిశారు. జాతీయ స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో సత్తా చాటి, విజయంతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కర్నూలు పేరు ప్రతిష్టను నిలపాలని అభిలాషించారు. ఆదివారం బయలుదేరనున్న కోచ్​ నరేంద్ర,క్రీడాకారుడు లోకేష్​ రెడ్డికి త్రినాథ్​ అకాడమీ  అకాడమీ చైర్మన్​, అమ్మ, ఆర్క్ హాస్పిటల్​ అధినేత డా. త్రినాథ్​ ఆర్థిక సాయం చేశారు.  

About Author