PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం..

1 min read

సంతాప సభలో మానవతా వాదుల సాయం రూ:54000/- లు 

వంద కేజీల బియ్యం అందజేత

ఐక్యతగా వివిధ జర్నలిస్ట్ సంఘాలు చేయూత

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : చింతలపూడి కి చెందిన జర్నలిస్ట్ అశోక్ కుటుంబానికి అండగా ఉంటామనీ జిల్లా జర్నలిస్టులు హామీ ఇచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్ట్ అశోక్ వర్ధన్ సంతాప సభ లో అధికారులు ,ప్రజా సంఘాల నాయకులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు భరోసా ఇచ్చారు.  ఏలూరు టైమ్స్ జర్నలిస్ట్ అశోక్ వర్ధన్ సంతాప సభ కార్యక్రమం సోమవారం చింతలపూడి మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వైస్ ప్రెసిడెంట్,ప్రింట్ మీడియా అధ్యక్షుడు ఎస్ కె అజాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అధ్యక్షుడు డా.బి రాంబాబు ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి చిన్న రాట్నా లు  మాట్లాడుతూ సమాజంలో ప్రజలకి ప్రభుత్వానికి వారధి లుగా పని చేసే జర్నలిస్టులకు అండగా ఉంటామని అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన అశోక్ కుటుంబానికి చేయూత అందిస్తాం అన్నారు.డిప్యూటీ తహశీల్దార్ షకీలా మాట్లాడుతూ అశోక్ ఎల్లపుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారని అన్నారు. మానవతా సంస్థ ముఖ్య సభ్యులు సోమ శేఖర్, ఎ.అప్పారావు, మదర్ థెరిస్సా ఫౌండేషన్ చైర్మన్ తూము విజయ్ కుమార్,వివిధ పార్టీల,ప్రజా సంఘాల  నాయకులు సూర్య కుమార్,బాబు,తాటి అప్పారావు,బి.నాగ భూషణం, శేష గిరిరావు ,రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాలరావు, డా.బిఆర్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం నాయకుడు కె.నాగేశ్వర్రావు, తదితరులు మాట్లాడుతూ అశోక్ భౌతికంగా మన మధ్య లేక పోయినా ఆయన కుటుంబానికి ఎల్లపుడూ అండగా ఉంటాం అని ధైర్యాన్ని ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్  జర్నలిస్ట్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అజాద్ , ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు, జిల్లా కోశాధికారి కె.నాగ చిన్నారావు లు మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అశోక్ వర్ధన్ అని, అశోక్ కుటుంబానికి జర్నలిస్ట్ సంఘాలు అండగా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా,మదర్ థెరిస్సా ఫౌండేషన్,వి ఆర్ వో అసోసియేషన్,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దాతల సాయంతో  54000/ రూపాయల ఆర్థిక సాయం మరియు రెవెన్యూ శాఖ నుండి వంద కేజీల బియ్యం ఎండిఓ రాట్నలు ,ఎంపీపీ రాంబాబు ల చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కిషోర్ వీరయ్య, ముత్తే శ్వరావు,లక్ష్మణ్ ,ఖలీల్  సూరిబాబు, కృపావరం, సంజయ్,నత్త వెంకటేశ్వరరావు బాలు,రాంబాబు,సునీల్, పా షి,మరియు పలు సంఘాల నాయకులు గురవయ్య, సత్తి బాబు, అబ్రర్ హుస్సేన్, వి ఆర్ వో లు తదితరులు పాల్గొన్నారు.

About Author