PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ని అధికారంలోకి తీసుకు రావడానికి ప్రతి కార్యకర్త కష్టపడాలి

1 min read

వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని 50వ వార్డు కార్పొరేటర్ శ్రీ ST. షేక్ అహ్మద్  అధ్యక్షతన కొట్టం శ్రీను మరియు వారి బృందం సుమారు 300 మంది మహిళా కార్యకర్తలతో టిడిపిని వీడి కర్నూలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి  A.Md. ఇంతియాజ్ గ సమక్షంలోబుధవారం వైసీపీలో, పార్టీ కార్యాలయం లో చేరడం జరిగింది.ఈ సందర్బంగా ఇంతియాజ్ మాట్లాడుతూ, వైసీపీ పార్టీ ని, అధికారం లోనికి తీసుకు వచ్చి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు. తాను జిల్లా కలెక్టర్ గా పనిచేసానని, ప్రతి పేదవాడి కష్టాలు తనకు తెలుసునని అన్నారు. జగనన్న ముఖ్య మంత్రి అయితే, తిరిగి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు. తనను కూడా అధిక మెజారిటీ తో గే్లీపిస్తే అహర్నిశలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవచేస్తానని అన్నారు. కార్యక్రమం లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author