PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాతో టచ్ లో వైసీపీ..నెల రోజుల్లో ఖాళీ..

1 min read

మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై నంద్యాల జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి విరుచుకుపడ్డారు.సోమవారం మధ్యాహ్నం నందికొట్కూరు లోని ఆయన స్వగృహంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున ఏ గ్రామంలో చూసినా వాడ వాడలోను పింఛన్ల పండగ వాతావరణం నెలకొంది.పింఛన్దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.గత ఎన్నికల్లో జగన్ ప్రజలను మాయమాటలు చెప్పి తన తండ్రి లాగే ఈయన పరిపాలన చేస్తాడని ప్రజలు అనుకుని ఐదు సంవత్సరాల పాలన ఇస్తే ఈ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి బ్రష్టు పట్టించారని ఎక్కడా కూడా అభివృద్ధి లేదని తన తండ్రి వైయస్సార్ కు జగన్ కు నక్కకు నాగలోకానికి తేడా ఉందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చిన్నబిన్నం చేశారు అలగనూరు రిజర్వాయర్ తెగిపోతే గండిని పుడ్చలేదు ముత్తాతలు సంపాదించిన పొలాల నంబరాలకు మీ ఫోటోలు ఏంటని అందుకే ప్రజలు పార్టీకి సరైన బుద్ధి చెప్పారన్నారు. తప్పు చేసిన వారు ఎవరు ఎక్కడ దాక్కున్నా కేసులు వదలవని నందికొట్కూరులో మాతో  టచ్ లో ఉన్నారని నెల రోజుల్లో వైసీపీని ఖాళీ చేస్తామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో అన్నారు.ఉదయం పట్టణంలోని జూనియర్ కళాశాల కాలనీలో ఇండ్లకు వెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు నందికొట్కూరు టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author