PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గౌరు సమక్షంలో వైసిపి వీడి టిడిపిలో చేరిక 

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రం గడివేములలో గురువారం నాడు 100 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టిడిపిలో చేరాయి. గడివేముల మండల టిడిపి సీనియర్ నాయకుడు బిడుదురి సీతారామిరెడ్డి ,వంగాల వెంకటేశ్వర రెడ్డి, వంగాల మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సమక్షంలో టిడిపి లో చేరారు. వీరందరినీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి  మాట్లాడుతూ గడివేముల మండలంలో వరుసగా వైసీపీ నుంచి టిడిపిలోకి వలసలు వస్తున్నారని, టీడిపి కి వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని రక్షించడమే అన్నారు. తెలుగుదేశంలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో  బిడుదూరి రమణారెడ్డి, ఎక్స్ సర్పంచ్ జమాల్ బాషా, ఎక్స్ వైస్ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, బట్టల షాపు ఎల్లప్ప, ఎక్స్ ఆర్మీ జమాల్ బాషా తదితరులు ఉన్నారు.

About Author