PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ సీఎం ను కలిసిన వైసీపీ నేతలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్,మాజీ శాసనసభ్యులు లబ్బి వెంకటస్వామి మాజీ ముఖ్యమంత్రి ని అమరావతి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన కలిశారు.అదే విధంగా బుధవారం సాయంత్రం నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ నేత వై చంద్రమౌళి క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం ను కలుసుకున్నారు.ఈ ఐదేళ్లపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం మీరు కృషి చేయాలని ఓడిపోయానే తలంపు మనసులో ఉండకుండా ధైర్యంగా ఉండాలని రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.

About Author