PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలపల్లిలో ఇంటింటి ప్రచారం చేపట్టిన వైసీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వైసీపీ నాయకులు ఎన్నంపల్లి పుల్లారెడ్డి మరియు యువ నాయకులు వై తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో  వారు ఇంటింటికి వెళ్లి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డికి మీ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.అంతేకాకుండా ఓటు ఏ విధంగా వేయాలి అనే వాటిపై ఈవీఎం ప్యాట్ నమూనా గురించి ఇంటింటి లో ఉన్న ఓటర్లకు వారు చూపించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఈవీఎం ఫ్యాట్ ద్వారావివిధ గ్రామాల నాయకులు ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలనే వాటిపై గెలుపే ధ్యేయంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వేల్పుల విజయ్, ధనుంజయ రెడ్డి,కురువ లక్ష్మన్న కాటం వెంకటేశ్వర్లు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author