PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ విజయం చారిత్రాత్మకం

1 min read

నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయండి

టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  తొలి సంతకం తోనే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రజల దేవుడని రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ లాయర్ బాబు అన్నారు శుక్రవారం నాడు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డిని కలిసి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అభిప్రాయాలకు అనుకూలంగా పరిపాలన నిర్వహిస్తామని ప్రకటించడం ఇది ప్రజా విజయం అన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుండి గాడి తప్పిన పరిపాలనను చక్కదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రజా వేదిక కూల్చడంతో మొదలు పెట్టిన వైసిపి పాలన రాష్ట్ర రాజధాని లేకుండా తుగ్లక్ నిర్ణయాలకు రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాలు ఎంతో నష్టం చవి చూసిందని. ప్రజలు ఇవన్నీ గమనించి మేలు చేసే ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం రావాలని కోరుకున్నారన్నారు భారీ మెజార్టీతో ఊహకందని విజయాన్ని ప్రజలు ఇచ్చి నారా చంద్రబాబునాయుడుని సత్కరించారు అన్నారు ఇక రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు . ఇచ్చిన హామీ ప్రకారం 5 హామీలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆకాంక్షలను గౌరవించారన్నారు రాష్ట్రం స్వర్ణయుగంగా మారబోతుందని అందులో మీరు భాగస్వామిగా ఉండడం మాకు ఎంతో ఆనందంగా ఉందని గౌరు చరిత రేడ్డిని అభినందించారు .

About Author