PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయం                

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఈసారి ఎన్నికల్లోనూ, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రావడం ఖాయమని పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి, ధీమా వ్యక్తం చేశారు. పత్తికొండ నియోజకవర్గం లోని క్రిష్ణగిరి మండలం,  ఎరుకలచెరువు,ఆగవేలి, గుండ్లమల్లాపురం,పోతుగల్లు గ్రామాలలో శనివారం కర్నూలు ఎంపి అభ్యర్థి బి వై రామయ్యతో కలసి ఆమె పార్టీ శ్రేణులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే తనకు, ఎంపీ అభ్యర్థి బి వై రామయ్య కి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. పేదవారు బాగుపడాలన్నా, మంచి చదువు, వైద్యం అందాలన్నా, ఈసారి జగనన్న ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.ఇవే సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలన్నా మరల జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు గజమాలలతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపిపి డాక్టర్ కంగాటి వెంకట రామిరెడ్డి , ZPTC సభ్యురాలు కేఈ సుభాషిని, మండల కన్వీనర్ ఆర్ బి వెంకటారాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author