PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టనున్న వైసిపి

1 min read

రాష్ట్రంలో సిఎం బస్సు యాత్రకు విశేష స్పందన

జన నేత జగనే మా గుండె చప్పుడంటున్న జనం

పేద ప్రజలకు,రైతులకు అండగా నిలబడేది

ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్న వైసిపి

ఎంఎల్సీ మొండితోక అరుణ్ కుమార్

పల్లెవెలుగు వెబ్ నందిగామ: రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం సృష్టించనుందని,ప్రజల అశీర్వాదం తమకే ఉందని వైసిపి ఎంఎల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పేర్కోన్నారు.రాష్ట్రంలో నేడు ఉన్న పరిస్ధితులను ఉద్ధేశించి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి కుదేలైందని,ఎక్కడ చూసిన టిడిపి,జనసేన‌ నేతలు అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు పదుల సంఖ్యలో అధినేత చంద్రబాబు మాట నమ్మమంటు టిడిపి నేతలు రెబల్ అభ్యర్ధులుగా బరిలో ఉన్నారంటేనే అ. పార్టీ పని అయిపోయిందని అర్ధమౌతుంది.జనసేనకు గుర్తు కేటాయించే హోదా రానందున రెబల్,ఇండిపెండెంట్ అభ్యర్ధులకు సైతం గ్లాసు గుర్తు చేటాయిచడం జనసేనకు తలనోప్పిగా మారిందని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్ధితుల్లో లేరని,విశ్వసనీయత అంటే సిఎం జగన్మోహనరెడ్డి పేరు గుర్తోస్తుందని తెలిపారు.కేవలం 58నెలల్లో సంక్షేమం,సుపరిపాలన,రైతులకు భరోసా కల్పించడం,నాణ్యమైన విద్య, పేదలకు కార్పోరేట్ వైద్యం,మరేన్నో పధకాలు సిఎం జగన్మోహనరెడ్డి అలోచనల్లోనుంచి వచ్చినవేనని అరుణ్ కుమార్ వివరించారు.దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమానికి అర్ధం చెప్పే విధంగా సచ్చివాలయాల ద్వారా సోంత గ్రామల్లోనే వందలాది సేవలు అందిస్తున్నారని,వాలంటరీ‌ వ్యవస్ధ ద్వారా ఇంటిటికి పెన్షన్లు అందిస్తున్న గోప్ప మానవతా వాది సిఎం జగన్నన్నేనని అన్నారు.రాష్ట్రంలో పేదలకు మేలు చేస్తుంటే ఎల్లో మీడియాకు మాత్రం ఇవి ఎమి కనిపించవు,వినిపించవు వారికి కావల్సింది చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే తప్ప ప్రజా సంకేమం కాదు అని మండి పడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజా మద్దత్తు వైసిపికే ఉందని గ్రహించిన టిడిపి,జనసేన ఎల్లో మీడియా నిరాధారమైన,అసత్య ఆరోపణలకు అధ్యం పోస్తున్నాయాని అగ్రహం వ్యక్తం చేశారు,ఎన్ని కుట్రలు చేసిన దేవుడి చల్లని చూపు,ప్రజల అశీస్సులు మాకే ఉన్నాయని ఎంఎల్సీ మొండితోక అరుణ్ కుమార్ చెప్పారు.ఇప్పటికైనా చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారాలు మానుకోక పోతే ప్రజాక్షేత్రంలో చరిత్ర హీనుడిగా మిగలడం ఖాయమని హితవు పలికారు.నందిగామ నియోజకవర్గం లో వైసిపి అభ్యర్ధి డాక్టర్ మొండితోక జగన్మోహన రావు ప్రచారానికి విశేషమైన జనాదరణ వస్తుందని,వైసిపి ప్రచారానికి ప్రజలే ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారంటేనే వైసిపి పట్ల ప్రజలకు ఎంత నమమ్మకం ఉందో తెలుస్తుందన్నారు.ఇంతటి ప్రజానమ్మకమే జగన్మోహనరావు గెలుపు ఖాయమని తెలిపారు.నియోజకవర్గం లో ప్రతి ఒక్కరు వైసిపి గెలుపునకు కృషి చేస్తున్నారని,రానున్న ఫలితాల్లో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అరుణ్ కుమార్ జ్యోస్యం చెప్పారు.

About Author