PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్సీపీ పార్టీ నామినేషన్ కార్యక్రమ ఆహ్వానం

1 min read

జయీభవ..విజయీభవ…విజయీభవ

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆశీస్సులతో ఆలూరు నియోజకవర్గ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బుసినే విరుపాక్షి  నామినేషన్ కార్యక్రమం 23-04-2024 మంగళవారం సమయం 09:00 గంటలకు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో సాయిబాబా దేవాలయం నుండి  MRO ఆఫీస్ వరకు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. జననేత శ్రీ బుసినే విరుపాక్షి  నామినేషన్ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఆరు మండలాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, సొసైటీ చైర్మన్లు, కెడిసిసి డైరెక్టర్లు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు,జేసిఎస్ మండల ఇన్చార్జిలు, సచివాలయ కన్వీనర్లు, విద్యా కమిటీ చైర్మన్లు, బూత్ కమిటీ మెంబర్లు, నీటి సంఘం అధ్యక్షులు, రైతు సంఘం అధ్యక్షులు, గృహ సారధులు, పార్టీ అనుబంధ విభాగాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ప్రజలు,యువత మీడియా ప్రతినిధులు, శ్రీ బుసినే విరుపాక్షిని ప్రేమించే ప్రతి గుండె, పెద్ద ఎత్తున తరలివచ్చి  బుసినే విరుపాక్షిని ఆశీర్వదించి ఆశీస్సులు ఇవ్వాలని, నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నాము.

About Author