PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. వేర్వేరు ప్ర‌మాదాల్లో ఆరుగురి మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తమ్మరాజు పల్లె గ్రామ సమీపాన ఉన్న సిమెంట్ నగర్ క్రాస్ రోడ్ వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అదే స‌మ‌యంలో ఈ రోజు తెల్లవారుజామున కర్నూలు జిల్లా సమీపంలోని రింగ్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా రాయదుర్గానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదుచేసుకుని విచారిస్తున్నారు. మ‌రో వైపు గడివేముల మండలంలోని దుర్వేసి గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పడం వల్ల ఓ పవన్‌ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరమట్టి గ్రామానికి చెందిన చంద్రకళతో మూడు సంవత్సరాల క్రితం పవన్‌కు వివాహం చేసుకున్నాడు. పనుల కోసం నంద్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ అనుకోని ప్రమాదం జరిగింది.

                           

About Author