PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నగరాభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నాం

1 min read
ప్రచారం చేస్తున్న బీవై రామయ్య

ప్రచారం చేస్తున్న బీవై రామయ్య

వైసీపీ 19వ వార్డు అభ్యర్థి బి.వై రామయ్య
పల్లె వెలుగు, కల్లూరు అర్బన్ : కర్నూలు నగరాభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నట్లు వైఎస్సార్ సిపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, 19వ వార్డు అభ్యర్థి బి.వై రామయ్య అన్నారు. శుక్రవారం ఉదయం నాలుగవ తరగతి ఉద్యోగుల కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.వై రామయ్య మీడియాతో మాట్లాడుతూ నగరాభివృద్ధిపై అవాకులు చవాకులు పేల్చుతున్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గత ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం ఏం చేసిందో, ఎంత నిధులు, నీళ్లు ఇచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. అసలు నగరాభివృద్ధి అంటున్న వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పగలరా అని ప్రశ్నించారు. అనంతరం కాలనీవాసులు పలు సమస్యలను బీవై రామయ్య దృష్టికి తీసుకురాగా.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

About Author