PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి చేశాం.. ప్రజాదరణ పొందాం..

1 min read
సభ్యత్వం అందజేస్తున్న ఎమ్మెల్యే వనమా

సభ్యత్వం అందజేస్తున్న ఎమ్మెల్యే వనమా

ఎమ్మెలేయ వనమా వెంకటేశ్వరరావు
పల్లెవెలుగు, కొత్తగూడెం;
రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు చేర్పించలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాతపాల్వంచలోని వనమా స్వగృహంలో నూతనంగా చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ మరో దశాబ్దం పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారాన్ని కొనసాగించడం ఖాయం అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాలను, మతాలను కలుపుకు పోతూ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నరన్నారు.రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పేరుతో రైతులకు ఎకరానికి 10 వేలు పెట్టుబడి సాయం రైతు రుణమాఫీ పథకం, రైతు బీమా, 5 లక్ష చెల్లింపు, మిషన్ కాకతీయ పేరుతో చెరువుల నిర్మాణం, మైనార్టీల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు షాదీముబారక్, రంజాన్ తోఫా, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు గిఫ్ట్లు, కళ్యాణలక్ష్మి, అమ్మవడి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ వంటి పథకాలు చేపడుతూ ప్రజలకే కీర్తించబడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం కెసిఆర్ అభివృద్ధిని వివరించి కొత్తగూడెం నియోజకవర్గంలో భద్రాద్రి జిల్లా లోనే ఎక్కువ సభ్యత్వాలు చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల్ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరావు, సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపల్లి కనకేష్, ఆత్మకమిటీ డైరెక్టర్ కాల్వ ప్రకాశ్, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, ఎంపీటీసీ వీరయ్య, టీఆర్ఎస్ నాయకులు కనగాల బాలకృష్ణ, బండి అంజయ్య, సురేష్, బోయపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author