PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభ్యర్థులను గెలిపించండి..

1 min read
ప్రచారంలో పాల్గొన్న కోట్ల జయ సూర్య ప్రకాశ్​ రెడ్డి, టీజీ భరత్​

ప్రచారంలో పాల్గొన్న కోట్ల జయ సూర్య ప్రకాశ్​ రెడ్డి, టీజీ భరత్​

టీడీపీ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి
పల్లెవెలుగు, కర్నూలు
అభివృద్ధిని కాంక్షించే వారు.. టీడీపీకి ఓటు వేయాలని ఆ పార్టీ రాష్ర్ట ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా… అభివృద్ధి శూన్యమన్న కోట్ల జయసూర్య ప్రకాశ్​ రెడ్డి.. కార్పొరేట్​ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. సోమవారం న‌గ‌రంలోని 22వ వార్డు అరోరా న‌గ‌ర్ రాజ‌రాజేశ్వరి దేవి ఆల‌యం వ‌ద్ద నుంచి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​ ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభించారు. వీధుల్లో తిరుగుతూ టిడిపికి ఓటు వేయాల‌ని అభ్యర్థించారు. కొండారెడ్డి బురుజుపై తెలుగుదేశం జెండా ఎగురుతుందన్నది స్పష్టమైందన్నారు. వైకాపా పాల‌న‌లో అబివృద్ధే లేద‌న్నారు. తెలుగుదేశం గెలిస్తేనే వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు. ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అరోరా నగర్ లోని రాజరాజేశ్వరి దేవి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి సావిత్రమ్మ, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

About Author