PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరేపల్లి శివారులో వ్యక్తి హత్య

1 min read

పల్లెవెలుగు, పెద్ద శంకరంపేట;
గుర్తుతెలియని దుండగులు చేతిలో ఆరేపల్లి గ్రామానికి చెందిన సంబు అంజయ్య (28 ) హత్యకు గురైన సంఘటన పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఆరెపల్లి శివారులో గురువారం ఉదయం చోటు చేసుకున్నట్లు పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్ తెలిపారు… మృతుడు శంబు అంజయ్య పెద్ద కొడంగల్ మండలం బేగంపేట గ్రామానికి చెందిన వారు కాగా కొన్ని సంవత్సరాల క్రితం పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామానికి ఇల్లరికం గా వచ్చి గొర్రెల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు… ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇంట్లో నుండి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు.. కుటుంబ సభ్యులు అంజయ్య కు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ స్విచాఫ్ రావడంతో ఇంటికి వస్తాడేమో అని ఎదురు చూశారు.. కానీ గుర్తుతెలియని దుండగులు చేతిలో ఆరేపల్లి శివారులోని అంజయ్య హత్య జరిగినట్లు వివరించారు… విషయం తెలుసుకున్న వెంటనే అల్లాదుర్గం సి ఐ రవి.. పేట ఎస్ఐ నరేందర్.. పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పోలీసు జాగిలాలు తో విచారణ చేపట్టారు… హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.. మృతుడి భార్య సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Author