NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్‌డబ్ల్యూపీలో ఉత్సాహం..

1 min read
పార్టీలోకి ఆహ్వానిస్తున్న హసీనాబేగం

పార్టీలోకి ఆహ్వానిస్తున్న హసీనాబేగం

పల్లెవెలుగు,కర్నూలు
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ వార్డుకు చెందిన మహిళలు నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎస్‌.హసీనాబేగం అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎన్‌డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం సమక్షంలో 50 మంది మహిళలు పార్టీ ఖండువా ధరించారు. ఈ సందర్భంగా హసీనాబేగం మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం… పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలకు సిద్ధం కావాని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కర్నూలు జిల్లా ఉమెన్స్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.మేరి, సురేఖ, సుజాత, విజయమ్మ, శరిన్‌ నగర్‌ కి చెందిన ఎస్‌.సుజాత, కె.శోభ విధ్య నగర్‌, పి. ప్రమవతి విధ్య నగర్‌, పి.అరోగమ్మ శారిన్‌ నగర్‌, టి.విజయమ్మ శ్రీరామ్‌ నగర్‌ తదితయి పాల్గొన్నారు.

About Author