PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్క ఓటుతో.. మహారాణి

1 min read
బుక్కాపురం సర్పంచ్​గా గెలుపొందిన కందుల వరలక్ష్మీ

బుక్కాపురం సర్పంచ్​గా గెలుపొందిన కందుల వరలక్ష్మీ

– ఉత్కంఠ భరితం సాగిన బుక్కాపురం జీ.పీ. ఎన్నిక
– ఓటు తేడాతో గెలుపొందిన వరలక్ష్మి
ఒకే ఒక్క ఓటు.. ఆమె జాతకాన్నే మార్చేసింది… ఆ ఒక్క ఓటు.. ఎందరికో కనువిప్పు కలిగించింది. గెలుపోటములను నిర్దేశించేది.. ఆ ఒక్క ఓటేనని… అందరికీ తెలిసిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. వివరాలిలా ఉన్నాయి.
బుక్కాపురం గ్రామపంచాయతీ ఎన్నికలో కందుల వరలక్ష్మీ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలువగా… మారెడ్డి రామసుబ్బమ్మ రెబల్​ అభ్యర్థిగా నిలిచారు. పోలీసు బందోబస్తు మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికలో మొత్తం 2096 ఓట్లు ఉండగా అందులో 1845 ఓట్లు పోల్ అయ్యాయి. 88.2 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో వరలక్ష్మీ 908 ఓట్లు సాధించగా.. రెబల్​ అభ్యర్థి రామసుబ్బమ్మ 907 ఓట్లు సాధించింది. దీంతో ఒక్కే ఒక్క ఓటు తేడాతో వరలక్ష్మి ఘన విజయం సాధించింది.

About Author