PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కానాలపల్లి అక్రమ అరెస్టు దారుణం..

1 min read
కాంగ్రెస్​, లక్ష్మీ నరసింహ, ఎన్నికలు , ElECTIONS, GRAMA PANCHAYATHI

కాంగ్రెస్​, లక్ష్మీ నరసింహ, ఎన్నికలు , ElECTIONS, GRAMA PANCHAYATHI

– నంద్యాల కాంగ్రెస్​ పార్లమెంట్​ అధ్యక్షుడు జై లక్ష్మీ నరసింహనంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం కానాలపల్లిలో సర్పంచ్ గా పోటీ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సురేంద్ర బట్టు తండ్రి ,
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లయ్యను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించడం దారుణమని నంద్యాల కాంగ్రెస్​ పార్లమెంట్​ అధ్యక్షుడు జై లక్ష్మీ నరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో వైసీపీ పాలనలో ఏకగ్రీవాలకు అంగీకరించకపోతే బెదిరింపులు, దాడులు, అక్రమ అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. కానాలపల్లిలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారనే భయంతోనే.. కౌంటింగ్​ సమయంలో.. ఇలా అభ్యర్థి తండ్రిని అక్రమ అరెస్టు చేశారని ఆరోపించిన జై లక్ష్మీ నరసింహ.. ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐకు ఫిర్యాదు చేశామన్నారు. ఇందుకు స్పందించిన డీఎస్పీ … మూడు పార్టీల వారిని స్టేషన్​కు పిలిపించారన్నారు. అయితే ఎటువంటి తప్పులు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని, అలా చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదన్నారు.అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే తప్పా మరొకటి కాదన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వెంటనే స్పందించి కానాల పంచాయతీ సర్పంచ్ ఎన్నికను తిరిగి నిర్వహించాలని ఈ సందర్భంగా నంద్యాల కాంగ్రెస్​ పార్లమెంట్​ అధ్యక్షుడు జై లక్ష్మీ నరసింహ కోరారు.

About Author