PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కారులో బీరు పార్టీ.. ఏరులై పారిన బ్లడ్

1 min read

అనంత‌పురం :
పెనుగొండ కియా పరిశ్రమ ప్రధాన గేటు వ‌ద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో న‌లుగురు అక్కడికక్కడే మ‌ర‌ణించారు. మృతులు బెంగుళూరు, ఢిల్లీకి సంబంధించిన వారిగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు నుంచి హైద‌రాబాద్ కు వెళ్లే స‌మ‌యంలో ఈ ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న న‌లుగురు వ్యక్తులు మ‌ద్యం మ‌త్తులో ఉండి.. వాహ‌నాన్ని న‌డ‌ప‌డం వ‌ల్లనే ప్రమాదం సంభవించింద‌ని పోలీసులు చెబుతున్నారు. కియా ప‌రిశ్రమ ప్రధాన గేటు వద్ద ఉన్న స్పీడ్ బ్రేక‌ర్ వ‌ద్ద ముందు వెళ్తున్న వాహ‌నాన్ని ఢీ కొన‌డంతోనే ఆ న‌లుగురు మృతి చెందిన‌ట్టు స‌మాచారం. మృతులు రేఖ‌, ఆంచ‌ల్ సింగ్ నార్త్ ఢిల్లీకి చెందిన వారు కాగా… మ‌హ‌బూబ్ ఆలం, మ‌నోజ్ మిట్టల్ బెంగ‌ళూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

About Author