NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గురి తప్పొదు…!

1 min read
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న డా. పార్థసారధి

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న డా. పార్థసారధి

రాష్ర్టస్థాయిలో మెడల్స్​ సాధించండి
– క్రీడాకారులకు సూచించిన బీజేపీ మీడియా ప్యానలిస్ట్​ డా. పార్థసారధి
పల్లెవెలుగు, కర్నూలు
లక్ష్యసాధనకు ఓపిక, శ్రద్ధ అవసరమని, అప్పుడు ఏదైనా సాధించగలమని బీజేపీ మీడియా ప్యానలిస్ట్​ డా. పార్థసారధి క్రీడాకారులకు సూచించారు. గురువారం నగరంలోని బీ క్యాంపు బాలికల గ్రౌండ్​లో ఆర్చరీ విభాగంలో రాష్ర్టస్థాయి పోటీలకు ఎంపికైన బాలబాలికలను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ ఆర్చరీలో ముఖ్యంగా ఏకాగ్రత అవసరమని, లక్ష్యాన్ని ఛేదించేందుకు గురి చేసి బాణం విసరాలన్నారు. అనంతరం వారికి టీ షర్ట్లు అందజేశారు. విజయవాడ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మెడల్స్ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పడం జరిగింది.

About Author