NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెట్టు పై నుంచి కింద పడి వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు, రుద్రవరం; మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన తెలుగు పాణ్యం వెంకట కొత్తూరయ్య ( 47 ) ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కింద పడి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు మృతుడు తెలుగు పాణ్యం వెంకట కొత్తూరయ్య ఉదయం 11:00 గంటలకు టెంకాయలు కొయ్యడాని టెంకాయ చెట్టు ఎక్కి టెంకాయలు కొస్తూ అదుపు తప్పి క్రింద పడడంతో తీవ్రగాయాలు కాగా కుటుంబ సభ్యులు బంధువులు చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడన్నారు. కొడుకు సుభాష్ భార్య లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

About Author