PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ.. మూల్యం చెల్లించాల్సిందే..

1 min read
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ప్రేమ్ కుమార్

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ప్రేమ్ కుమార్

అమరావతి జేఏసీ ముసుగులో విష్ణువర్ధన్​ రెడ్డిపై దాడి దారుణం
– బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ప్రేమ్ కుమార్
పల్లెవెలుగు, కర్నూలు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర సహాయ మంత్రి హోదా కలిగిన నెహ్రూ యువ కేంద్ర జాతీయ వైస్ చైర్మన్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పై అమరావతి జేఏసీ ముసుగులో దాడి చేసిన టీడీపీ గుండాలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం గూడురులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి పై చర్చకు ఓ ఛానెల్​ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించిందని, కానీ ఆయనపై దాడి జరుగుతున్న సమయంలో ప్రొటెక్షన్​ కల్పించడంలో విఫలమైందని, ఆ ఛానెల్​ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. మంగళవారం ఆ ఛానల్​లో ‘‘అమరావతి’’ పై డిబేట్ జరుగుతుండగా అమరావతి జేఏసీ ముసుగులో ఉన్న టిడిపి నాయకుడు శ్రీనివాస్ రావు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ వై కె జాతీయ వైస్ చైర్మన్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతుండగానే అడ్డంగా జోక్యం చేసుకొని డిబేట్ లో అందరూ చూస్తుండగానే .. దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు . పోలీస్ శాఖ జోక్యం చేసుకొని సుమోటోగా కేసు నమోదు చేసి శ్రీనివాస్ రావు పై చట్టరీత్య చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు . ఓ వైపు అధికార పార్టీ అరాచకాలు అక్రమాలకు పాల్పడుతుంటే .. నేనేమి తక్కువ లేదంటూ మరోపక్క టిడిపి నాయకులు అరాచకాలకు పాల్పడడం ప్రజలు గమనిస్తున్నారని, వారికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల ప్రేమ్ కుమార్

About Author