PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోటీకి సై..!

1 min read
వైసీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ చేతుల మీదుగా బీఫారం అందుకుంటున్న 49వ వార్డు అభ్యర్థి కృష్ణకాంత్​ రెడ్డి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ చేతుల మీదుగా బీఫారం అందుకుంటున్న 49వ వార్డు అభ్యర్థి కృష్ణకాంత్​ రెడ్డి

మొదటి జాబితాను విడుదల చేసిన వైసీపీ
– 15 మందికి బీఫారం అందజేత
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు కార్పొరేషన్​ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి . ఇప్పటి వరకు పార్టీ టిక్కెట్​ వస్తుందో… రాదో.. అన్న సందేహాలతో ప్రచారానికి దూరంగా ఉన్న కొందరు వైసీపీ నాయకులు… బీ ఫారాలు అందుకోవడంతో… మళ్లీ రంగంలోకి దిగనున్నారు. సార్వత్రిక ఎన్నికలో ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ గెలుపునకు సహకరించిన.. కారకులైన వారు.. ఏకతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు… అందరినీ కలుపుకొని కార్పొరేట్​ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం రాత్రి వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ పార్లమెంట్​ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎన్నికల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే గురునాథ్​ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, వైసీపీ రాష్ర్ట అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్​ రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్​ రెడ్డి చేతుల మీదుగా 15 మంది కార్పొరేటర్​ అభ్యర్థులకు భీఫారాలు అందజేశారు.
బీఫారాలు అందుకున్న అభ్యర్థులు వీరే…
1వ వార్డు షాషావలి, 2వ వార్డు ఫిరోజ్​, 3వ వార్డు షాజహాన్​ పర్వీన్​, 4వ వార్డు అర్షియ ఫర్హీన్​, 5వ వార్డు సుజాత, 8వ వార్డు అబ్రర్​, 10వ వార్డు యూనుస్​, 11వ వార్డు మహ్మద్​ ఫరాజ్​ఖాన్​, 13వ వార్డు ఎం. విజయలక్ష్మి, 14వ వార్డు శివ, 17వ వార్డు కైపా పద్మలతా రెడ్డి, 18వ వార్డు పల్లవి, 42వ వార్డు కసి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, 45వవార్డు రాధిక, 49వ వార్డు ఎస్​. కృష్ణకాంత్​ రెడ్డి

About Author