PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రత్యర్థులకు ఓటమి భయం..

1 min read
కార్పొరేషన్​ అభ్యర్థులతో టీజీ భరత్​

కార్పొరేషన్​ అభ్యర్థులతో టీజీ భరత్​

– అందుకే మా నాయకులకు బంపర్​ ఆఫర్​ ఇస్తున్నారు..
– టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టి.జి భ‌ర‌త్‌
పల్లెవెలుగు, కర్నూలు

కర్నూలు మున్సిపల్​ ఎన్నికల్లో అధికవార్డులు ఓడిపోతామన్న భయంతోనే తమ నాయకులకు ప్రత్యర్థి పార్టీ నాయకులు బంపర్​ ఆఫర్​ ఇస్తామని ఫోన్​లు చేస్తున్నారని టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టి.జి భ‌ర‌త్‌ ఆరోపించారు. సోమ‌వారం మౌర్యఇన్‌లో 42, 44, 45, 46, 47, 48 వార్డుల‌కు సంబంధించిన కార్పోరేట‌ర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ముఖ్య నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వహించి మాట్లాడారు. క‌ర్నూలు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో ప్రతి ఒక్క కార్పోరేట‌ర్ అభ్యర్థి గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలన్నారు. ప్రశ్నించే వారు ఉంటేనే ప్రభుత్వం అభివృద్ధి ప‌నులు చేస్తుంద‌న్నారు. అందుకే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగుర‌వేద్దామ‌ని చెప్పారు. ప్రజల‌ను క‌లిసి తాము గెలిస్తేనే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని అర్థమయ్యేలా చెప్పాల‌న్నారు. ఇక ప్రత్యర్థులకు ఓటమి భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు. అందుకే త‌మ పార్టీకి చెందిన అభ్యర్థులు, ముఖ్య నాయ‌కుల‌కు ఫోన్‌లు చేసి పద‌వులు ఆశ‌చూపి ప్రలోభాల‌కు గురిచేస్తున్నార‌న్నారు. అధికారం లేక‌పోయినా టిడిపి స‌త్తా ఏంటో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తేలిపోయింద‌న్నారు. ప్రజలు టిడిపివైపు ఉన్నార‌న‌డానికి ఇదే నిదర్శనమన్నారు. కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్రతిఒక్కరూ కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో కార్పోరేటర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ముఖ్య నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author