PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడా హీరోల..జాబితాలో ప్రభాస్​

1 min read

– ‘రాధేశ్యామ్​’ తరువాత పెరిగిన రేంజ్​
ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే అక్షయ్ కుమార్, అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్.. వంటి బడా హీరోల జాబితాలో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ చేరాడట. దక్షిణాది నుంచి ఈ రేంజ్ పారితోషికం అందుకుంటున్న నటుడిగా నిలిచాడట. నిజానికి పైన చెప్పిన బాలీవుడ్ హీరోలకు దక్షిణాదిన అంత పెద్ద మార్కెట్ లేదు. కానీ, ప్రభాస్‌కు బాహుబలి కారణంగా దక్షిణాదిన ప్రతి రాష్ట్రంలోనూ, ఉత్తరాదిన మార్కెట్ ఏర్పడింది. ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో మూడు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. రాధేశ్యామ్ తర్వాత అంగీకరించిన సినిమాలన్నింటికీ ప్రభాస్ ఈ రేంజ్‌లోనే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాధేశ్యామ్ కనుక దేశవ్యాప్తంగా విజయవంతమైతే ప్రభాస్ పారితోషికం మరింత పెరగవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

About Author