PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధితురాలికి పరామర్శ

1 min read
బాధితురాలి కుటుంబీకులతో మాట్లాడుతున్న హసీనాబేగం

బాధితురాలి కుటుంబీకులతో మాట్లాడుతున్న హసీనాబేగం

ధైర్యంగా ఉండాలని సూచించిన ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూలు జిల్లా వెలుగోడు మండలం వెల్పనురు గ్రామంలో అత్త, మామ, భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇంట్లోనే కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం సోమవారం ప్రభుత్వ ఆస్ప్రతిలో చికిత్సపొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్​.హసీనాబేగం మాట్లాడుతూ బాధితురాలికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. వివాహితను వేధింపులకు గురి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసిన ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు…బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆస్ప్రతి వైద్యులను కోరారు. కార్యక్రమంలో పార్టీ వింగ్ ప్రెసిడెంట్ మెరీ, వాలంటీర్స్ సిమ్రాను,అనిత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author