PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుక్కాపురం ‘ పంచాయతీ ’

1 min read

– రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేసిన మాజీ సీఎం
మహానంది మండలం బుక్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికపై రాష్ర్ట ఎన్నికల కమిషనర్​కు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ విషయం మండలంలో హాట్​ టాపిక్​గా మారింది. బుక్కాపురం వైసీపీ రెబ్​ అభ్యర్థి ఎం. రామసుబ్బమ్మ 907 ఓట్లు సాధించగా… వైసీపీ అభ్యర్థి కందుల వరలక్ష్మి 908 ఓట్లు సాధించింది. కేవలం ఒక్క ఓటుతో వరలక్ష్మి సర్పంచ్​ పదవిని కైవసం చేసుకుంది. ఎన్నికలకు సంబంధించి రీ కౌంటింగ్​ చేయాలని వైసీపీ రెబల్​ అభ్యర్థి ఎం. రామలక్ష్మమ్మ నంద్యాల ఆర్డీఓకు వినతిపత్రం అందించింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుక్కాపురం గ్రామపంచాయతీ ఎన్నిక కౌంటింగ్​లో అవకతవకలు జరిగాయని, మళ్లీ ఎన్నికలు జరపాలని రాష్ర్ట ఎన్నికల కమిషనర్​ కు , కలెక్టర్​ జి. వీరపాండియన్​కు ఫిర్యాదు చేశారు.

About Author